వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. మీ మీ పరిధిలో మంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో పాటు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలనిపార్టీ కన్వీనర్లు, కో -కన్వీనర్లు, దళిత, మైనార్టీ, యువజన విభాగాల నాయకులకు సూచించింది.