Monday, May 6, 2024
Monday, May 6, 2024

‘స్పర్శ్‌ హాస్పిస్‌’ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఖాజాగూడలో ఎకరా విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్నిమంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. క్యాన్సర్‌ రోగులకు ఇంతకాలం రోటరీ క్లబ్‌ బంజారాహిల్స్‌ సారథ్యంలో అక్కడి రోడ్‌ నం.12లోని అద్దెభవనంలో సేవలు అందించింది. ప్రస్తుతం దానిని ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన భవనానికి మార్చారు. నూతన భవనంలో పూర్తి వసతులతో 82 పడకలు ఏర్పాటు చేశారు. చిన్నారులకోసం ప్రత్యేకంగా 10 పడకలు ఏర్పాటు చేశారు. ఈ స్థలాన్ని 33 ఏండ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఆఖరి ఘడియల్లో ఉన్న వేలాది మంది కాన్సర్‌ రోగులకు స్పర్శ్‌ హాస్పిస్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img