Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

వీసీలతో సమీక్షించిన ఉన్నత విద్యా మండలి

విశాలాంధ్ర- జెఎన్టియుఏ: ఏపీ ఉన్నత విద్య ప్రణాళికా సంఘం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్ధన్, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రామకృష్ణారెడ్డి, కేంద్రీయ విశ్వవిద్యాలయ వీసి ఆచార్య ఎస్ ఏ .కోరి ,రెక్టర్ ఆచార్య విజయ్ కుమార్ తో పరిశోధనలపై సమీక్షించారు. అనంతరం జేఎన్టీయూ వీసి మాట్లాడుతూ.. రీజినల్ క్లస్టర్ గ్రూపు భాగస్వామ్యం, పలు అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. అనంతరం ఎస్కేయూ వీసి మాట్లాడుతూ.. ఆవిష్కరణల సదస్సులు, నైపుణ్య అభివృద్ధి, ప్రకృతి సంరక్షణ, మొదలగు అంశాలపై తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్వవిద్యాలయ ఉపకుల బదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img