పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహణ
కేంద్ర మంత్రిని కలసిన జెడ్పీ ఛైర్మన్
విశాలాంధ్ర – విజయనగరం : మండల, జిల్లా స్థాయి అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ( జనవరి 5,6 తేదీల్లో) గురు, శుక్రవారాల్లో నిర్వహస్తున్న జాతీయ స్థాయి కార్యశాలకు జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని డా.బి.ఆర్.అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ఈ రెండు రోజుల వర్క్ షాప్ జరుగుతోంది. మండలాలు, జిల్లాల అభివృద్ధికి ప్రాజెక్టు ఆధారిత అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన (ూతీశీjవష్ ణతీఱఙవఅ దీశ్రీశీషస ణవఙవశ్రీశీజూఎవఅ్ ూశ్రీaఅ aఅస ణఱర్తీఱష్ ూaఅషష్ట్రaవa్ ణవఙవశ్రీశీజూఎవఅ్ ూశ్రీaఅ) అనే అంశంపై రెండు రోజులపాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొని పలు అంశాలపై చర్చిస్తారు. మన రాష్ట్రం తరపున జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సహా పలువురు జిల్లాపరిషత్ ఛైర్మన్లు ఈ వర్క్షాప్కు హాజరయ్యారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్, కార్యదర్శి సునీల్ కుమార్, సంయుక్త కార్యదర్శి అలోక్ ప్రేమ్ నాగర్ తదితరులు ప్రారంభోపన్యాసం చేశారు. పంచాయతీరాజ్ రంగంలోని పలువురు నిపుణులు, పలువురు కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యశాలలో ప్రసంగించనున్నారు. జిల్లా, మండల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలోదేశంలోని పలు ప్రాంతాలకు చెందిన సంస్థలు తమ అనుభవాలను తెలుపుతూ ఈ కార్యశాలలో ప్రసంగించనున్నారు. ఈ వర్క్ షాప్లో జిల్లా పరిషత్ ఇన్ చార్జి సి.ఇ.ఓ. కె.రాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. మండల, జిల్లాపరిషత్ ల అభివృద్ధికి నిధుల విడుదల తదితర అంశాలపై జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ను కలసి చర్చించారు.