Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రజల పక్షాన పోరాడటమే జనసేన లక్ష్యం

చింతలపూడి: ప్రజల పక్షాన పోరాడటమే జనసేన పార్టీ లక్ష్యం అని జనసేన మండల అధ్యక్షులు చీరాల మధు అన్నారు. సోమవారం స్థానిక బట్టు వారి గూడెం రోడ్డుపై నీటి గుంతలో కూర్చొని దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిత్యం ప్రజలను మోసం చేస్తూ హామీలను నిలబెట్టుకోలేకపోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని, కాస్త వర్షానికే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని, వీటితోపాటు ప్రజా సమస్యలను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లాలని ఉద్దేశంతో దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ నిరసన దీక్షలో జనసేన జిల్లా నాయకులు విజయ్ కుమార్, ఏసుబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img