: అఖిలేష్ యాదవ్
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రాజెక్టును హడావిడిగా నాసిరకంగా పూర్తిచేయడంలో బీజేపీ ప్రభుత్వం నాణ్యత విషయంలో రాజీపడిరదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాలను ఆశించిన బీజేపీ అరకొరగా పూర్తయిన పూర్వంచల్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభిస్తోందన్నారు. పూర్తి నాణ్యతతో చేపట్టాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బీజేపీ నాసిరకంగా నిర్మించిందని ఆరోపించారు.