దిల్లీలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్లో వెల్లడిరచారు. మొత్తం 148.33 లక్షల మంది అర్హత ఉన్న జనాభాకు వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బందికి, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇతర అధికారులకు ధన్యవాదాలు చెబుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు అనుమతినీయలేదు.