Homeఅంతర్జాతీయంచరవాణిలో మాట్లాడిన మంత్రి లోకేష్

చరవాణిలో మాట్లాడిన మంత్రి లోకేష్

- Advertisement -

ఎర్ర కాలువ ముంపు ప్రాంత రైతులతో మాట్లాడిన మంత్రి లోకేష్

విశాలాంధ్ర – నల్లజర్ల : ముందుగా మీరు చర్యలు తీసుకోండి రైతులతో చరవాణిలో మాట్లాడిన మంత్రి లోకేష్ . నల్లజర్ల మండలం గుండెపల్లి గ్రామంలోని ఎర్ర కాలువ ముంపు ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం రైతులతో కలిసి పర్యటించారు. ఆ సమయంలో మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే వెంకట్ రాజుకు ఫోన్ చేశారు ఈ సందర్భంలో ఎమ్మెల్యే పక్కన ఉన్న రైతులతో మంత్రి మాట్లాడుతూ ముందుగా మీరు చర్యలు తీసుకోండి కాలువ గట్లు గండ్లు పడిన చోట తగిన చర్యలు ముందస్తుగా తీసుకోండి అన్నారు ఓ రైతు మంత్రి తో మాట్లాడుతూ 2018 సంవత్సరంలో వర్షాలకు పడిన గండ్లు నేటికీ అలానే ఉండిపోయాయని గత పాలనలో ఏ విధమైన చర్యలు తీసుకోలేదని దీంతో చాలా నష్టపోతున్నామని మంత్రికి తెలిపారు. ప్రతిసారి ఎమ్మెల్యే దీనిపై రిక్వెస్ట్ లెటర్లు పంపిస్తున్నారని దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు దీంతో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ముందుగా కాలువగండ్లకు ఇసుక బస్తాలు వంటి రక్షణ చర్యలు చేపట్టండి మీ పంటలను మీరు కాపాడుకోండి తదుపరి ప్రభుత్వ సహాయం అందిస్తాం అన్నారు రాష్ట్రంలో సుమారు 10 నుంచి 12 ఇలాంటి కాలువలు ఉన్నాయి ఇవి వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు పొంగి పొలాలను ముంచేస్తాయి అందుచేత ముందస్తు చర్యలు తీసుకోండి మీరంతా జాగ్రత్తగా ఉండండి అంటూ ఆయన ఫోన్లో మాట్లాడారు ఒక రైతు రెండు రోజుల నుంచి ఎమ్మెల్యే  చాలా కష్టపడుతున్నారని అనడంతో ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి తోపాటు రైతులు, కార్యకర్తలు ఇటువంటి విపత్తు సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ సుమారు పదివేల మందికి ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన షెల్టర్ లో భోజనాలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. చివరిగా అందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు