అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు హైకోర్టులో ఊరట లభించింది.అసైన్డ్ రైతుల భూముల క్రయ విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 316పై ధర్మాసనం స్టేటస్ కో ఇచ్చింది. నోటీసులు ఇవ్వకుండా కేటాయించిన ప్లాట్లను రద్దు చేసేందుకు జీవో ఇచ్చారని న్యాయవాది ఇంద్రనీల్ బాబు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం వైపు వాదనలు విన్న అనంతరం ధర్మాసనం స్టేటస్ కో విధించింది. జీఓకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏఎమ్ఆర్డీఏను ఆదేశించింది.