Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘మహాభారత్‌’ శకుని పాత్రధారి కన్నుమూత

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గుఫి పైంతాల్‌ (79) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పైంతాల్‌ మహాభారత్‌ సీరియల్లో ‘శకుని మామ’ పాత్ర పోషించి ప్రేక్షకుల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక హిందీ సినిమాలు, సీరియళ్లలోనూ నటించారు. గుఫి పైంతాల్‌ మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img