Friday, April 26, 2024
Friday, April 26, 2024

అసెంబ్లీకి ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా.. టీడీపీకి ఓటు వేసింది వీళ్లేనా?

క్రాస్ ఓటింగ్‌పై సోషల్ మీడియాలో చర్చ
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయాలు వేడెక్కాయి. సొంత పార్టీకి ఝలక్ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌ చేశారు. అనూహ్యంగా పంచుమర్తి అనురాధ విజయం సాధించడం అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్లైంది. దీంతో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరో తేల్చే పనిలో ఉంది వైఎస్సార్‌సీపీ.. అంతర్గతంగా ఇప్పటికే వారిద్దరు ఎవరో గుర్తించామని పార్టీ నేతలు చెబుతున్నారు. సమయానుకూలంగా వారిపై చర్యలు కచ్చితంగా ఉంటాయంటున్నారు.ఈ క్రాస్ ఓటింగ్ వ్యవహారంలో ప్రధానంగా ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి మాత్రం తాను క్రాస్ ఓట్ చేయలేదని.. ఓటు వేసే ముందు తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను పార్టీ లైన్ దాటలేదని.. తనకు ఇచ్చిన కోడ్ ప్రకారమే ఓటు వేసినట్లు చెబుతున్నారు. అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని.. తనను ఈ వివాదంలోకి లాగొద్దన్నారు.

ఇదిలా ఉంటే శుక్రవారం అసెంబ్లీకి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , ఉండవల్లి శ్రీదేవిలు హాజరుకాలేదు. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఓటు వేసి వెళ్లిపోయారు.. ఎవరికీ అందుబాటులోకి రాలేదు. మేకపాటి ఓటు వేసి నేరుగా బెంగళూరు వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.. ఆయన ఎవరికీ అందుబాటులోకి రాలేదట. అలాగే మేకపాటి ఆఫీస్‌లో ఫ్లెక్సీలను తొలగించినట్లు తెలుస్తోంది.. ఆయన అనుచరులకు కూడా టచ్‌లో లేరని చెబుతున్నారు. ఇక శ్రీదేవి అసెంబ్లీకి హాజరుకాకపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. గురువారం ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను సోషల్ మీడియాలోనూ టార్గెట్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img