Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

అసోంలో 46గ్రామాలను ముంచెత్తిన వరదలు

ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోన్న బ్రహ్మపుత్ర
గత రెండు రోజులుగా అస్సాం.. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొర్లి పొంగుతున్నాయి. ధేమాజీ, దిబ్రూఘర్‌, లఖింపూర్‌ జిల్లాలోని 46 గ్రామాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. వరదల కారణంగా ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. పొలాల్లోకి వరద నీరు చేరడంతో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img