Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 11,106 కరోనా కేసులు


దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా 11,38,699 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. దేశంలో కొత్తగా 11,106 కేసులు నమోదయ్యాయి. మరో 459 మంది మృతిచెందారు. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఒక్క కేరళలోనే 6,111 కొత్త కేసులు, 372 మరణాలు సంభవించాయి. దేశంలో తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, మరణాలు 4,65,082కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,26,620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img