దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో అవే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 15,786 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,43,236కు చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,75,745గా ఉన్నాయి. మరో 231 మంది మరణించడంతో మృతుల సంఖ్య 4,53,042కు పెరిగాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 8,733 కేసులు ఉన్నాయి.