ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖ పాత పాటనే పాడిరది. గతంలో చెప్పిన మాదిరే ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని లోక్ సభ వేదికగా కేంద్రం మంగళవారం మరోసారి స్పష్టంచేసింది. ఈ మేరకు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సంధించిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఏ విషయాలైతే కేంద్రం చెప్పిందో… మంగళవారం నాటి సమాధానంలో నిత్యానందరాయ్ అవే విషయాలను ప్రస్తావించడం గమనార్హం. ఏపీకే కాకుండా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వలేదని మంత్రి నిత్యానందరాయ్ వెల్లడిరచారు. ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచినట్లు ఆయన వివరించారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడిరచారు. 15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫారసులను కొనసాగించినట్లు ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలోని చాలా హామీలను నెరవేర్చామన్న కేంద్ర మంత్రి… విభజన చట్టంలోని కొన్ని హామీలు మాత్రమే పెండిరగ్లో ఉన్నాయని వెల్లడిరచారు. వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాలతో ఇప్పటిదాకా 28 సార్లు భేటీ అయినట్లు నిత్యానందరాయ్ తెలిపారు.