దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లా చిత్రగామ్లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. నిన్న సాయంత్రం చిత్రగామ్లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక మృతిచెందాడు. దీంతో భద్రతాబలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతాదళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు.అతడిని అనాయత్ అహ్మద్ దార్గా గుర్తించామన్నారు. అతని వద్ద ఒక పిస్తోల్, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.