ఒలింపిక్స్లో భారత్కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన డిస్కస్ త్రోయర్ కమల్ప్రీత్ కౌర్ సోమవారం నిరాశపరిచింది.మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో ఈరోజు పోటీపడిన కమల్ప్రీత్ కౌర్.. ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్లో డిస్క్ని 64మీ దూరం విసిరిన కమల్ప్రీత్..ఇవాళ ఫై˜ౖనల్లో కేవలం 63.70మీ దూరం మాత్రమే విసరగలిగింది. అమెరికాకి చెందిన ఆల్మాన్ 68.98మీతో గోల్డ్ మెడల్ సాధించగా.. జర్మనీకి చెందిన క్రిస్టిన్ 66.86మీతో రజతం, క్యూబాకి చెందిన పెరేజ్ 65.72మీతో కాంస్య పతకాలు గెలుపొందారు.