Friday, April 26, 2024
Friday, April 26, 2024

పూర్వ గురువులను కలిసిన డాక్టరు స్వాతి

విశాలాంధ్ర,సీతానగరం: బూర్జ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలోచదివి శ్రీకాకుళంలో ఎంబిబిఎస్ చదివిన డాక్టరు భవిరిశెట్టి స్వాతి తన పూర్వగురువులను శుక్రవారం కలిసి తనకు విద్యనేర్పిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు హైస్కూలు స్థాయిలో అన్ని అంశాలు చక్కగా బోధించడంతోనే అప్పట్లో ఎంబిబిఎస్ సాధించానని చెప్పారు. ఇటీవల నీట్ (పిజీ)పరీక్షలో కూడా 2300 ర్యాంకు సాధించినట్లు చెప్పారు. విద్యనేర్పి ప్రస్తుతం సీతానగరం ఉన్నతపాఠశాలలో పనిచేస్తున్న పూర్వ గురువులు శ్రీనివారావు, రవి, ధనంజయ, పైడిరాజులను కలిసి ఆశీర్వదంలు తీసుకున్నారు. నీట్ లో ర్యాంకు సాధించిన డాక్టరు స్వాతిని ప్రదానోపాధ్యాయురాలు ఇల్లా ప్రసన్నలక్ష్మి, జిల్లా పిఆర్టియు మణ్యంజిల్లా ఆద్యక్షులు వాలేటి తవిటినాయుడు,టీచర్లు గోపాల్ ,నాయుడు ,జగన్, రామారావు తదితరులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img