మజ్లిస్ కీలక నేత, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి భారీ ఊరట దక్కింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై నమోదైన కేసులను కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు బుధవారం నాడు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో అక్బరుద్దీన్ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు.. ఈ కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.