Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈ నెల 27, 28వ తేదీలలో ఓటరు జాబితా సవరణ క్యాంపెయిన్‌

ఎలక్షన్‌ కమిషన్‌ ఈ నెల 27, 28వ తేదీలలో ఓటరు జాబితా సవరణ ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహిస్తోంది. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ తెలిపారు.జనవరి1, 2022 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన వారు నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. 2021 సంవత్సరపు ముసాయిదా ఓటరు జాబితాను భారత ఎన్నికల సంఘం నవంబర్‌ 1వ తేదీన విడుదల చేసింది. ఈ జాబితాలో పేరు మార్పు, అడ్రస్‌ మార్పు, తదితర మార్పులు, చేర్పులు ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌ సందర్భంగా చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం మీ సమీప పోలింగ్‌ బూత్‌ లో ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌ స్థాయి అధికారి అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img