పార్టీ కోసం తాను చేసిన సేవలు గుర్తించి సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చారని హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఇల్లంతకుంటలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బుధవారం జరిగిన సభకు హాజరై ప్రసంగించారు.త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు శ్రీనివాస్ యాదవ్ పాదాభివందనాలు తెలిపారు.తనను గెలిపిస్తే మీ పని మనిషిలా సేవ చేసుకుంటానని అన్నారు.