Friday, April 26, 2024
Friday, April 26, 2024

క్యాసినో.. ఈడీ విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్‌

క్యాసినో ప్రధాన సూత్రధారి చీకోటి ప్రవీణ్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. బ్యాంకు స్టేట్‌మెంట్లు, నోటీసు కాపీతోపాటు అడ్వకేట్‌ను ప్రవీణ్‌ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నది. విదేశాల్లో క్యాసినో నిర్వహణ, హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రవీణ్‌, మాధవరెడ్డి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. వారివద్ద ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img