: మంత్రి కేటీఆర్
చేనేత కళాకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్, మెరిట్ సర్టిఫికెట్స్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ను మంత్రి అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అవార్డు గ్రహీతులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతమని అన్నారు.