ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఒవైసి జంక్షన్ లో నిర్మించిన భారీ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. 80 కోట్లతో మూడు వరుసల రహదారిని 1.3 కి.మీ. మేర ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. నగరం తూర్పు ప్రాంతానికి, పాత బస్తీకి వారధిగా పైవంతెన నిలవనుంది. ముఖ్యంగా పాత బస్తీ నుంచి ఎల్బీనగర్ వైపు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్, స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ,మహమూద్ అలీ,ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు హాజరయ్యారు.