మంత్రి సత్యవతి రాథోడ్
ప్రతి రంగంలో అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నిరంతరం అన్నదాతల సంక్షేమం కోసమే ఆలోచిస్తూ రైతును రాజును చేసేందుకు అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారన్నారు. జిల్లాలోని కేసముద్రంలో గురువారం డీసీసీబీ బ్రాంచ్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు మార్నేని రవీందర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతు రుణ పరిమితి సీలింగ్ పదిలక్షలకు పెంచడం సంతోషకరం అన్నారు.స్వాతంత్య్రానంతరం 75 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మరో ఎత్తు అని అన్నారు.