Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

బాధిత కుటుంబాలను పరామర్శించిన చాడ

విశాలాంధ్ర, సిద్దిపేట: ఇటీవల వివిధ కారణాలతో మరణించిన బాధిత కుటుంబాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శనివారం పరామర్శించారు. ముందుగా హుస్నాబాద్‌ మాజీ వైస్‌ ఎంపీపీ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్‌ తండ్రి గడిపె కొమురయ్య, స్వాతంత్ర సమరయోధుడు కొండా చిన్న మల్లయ్య, కాంగ్రెస్‌ నాయకులు రాచకట్ల మైసరాజు,రైతు గడిపె వీరయ్య కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంటా సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జాగీర్‌ సత్య నారాయణ,మచ్చ శ్రీనివాస్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేశ్‌, అందే అశోక్‌, కనుకుట్ల శంకర్‌, సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు కొయ్యడ కొమురయ్య,బద్దిపడగ రాజారెడ్డి, ఎగ్గోజు సుదర్శన్‌ చారి, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్‌, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి,మాడిశేట్టి శ్రీదర్‌,అయిలేని సంజివరెడ్డి,తోట అయిలయ్య,మంద శ్రీనివాస్‌, రామవరం మాజి సర్పంచ్‌ కత్తుల ఎల్లయ్య,లోక్‌ సత్తా ఉద్యమ నాయకులు మల్కిరెడ్డి మెహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img