తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడిరచింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది. కాగా, హైదరాబాద్తోపాటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడి వర్షం బీభత్సం సృష్టించింది.