Friday, April 26, 2024
Friday, April 26, 2024

యువతను రెచ్చగొట్టొద్దు : మంత్రి గంగుల

సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ నాయకులకు బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. గతంలో మాదిరిగానే ఆర్మీలో నియామకాలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. సికింద్రాబాద్‌ ఘటన నేపథ్యంలో ఆయన ప్రకటన చేస్తూ సికింద్రాబాద్‌ ఘటనలో టీఆర్‌ఎస్‌ పాత్ర వుందని చెబుతున్న ఆ పార్టీ నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా టీఆర్‌ఎస్‌ వాళ్లే చేపించారా? అని ప్రశ్నించారు. సున్నితమైన అంశాలపై ఆచితూచి మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలి తప్ప వివాదం చేయొద్దని, మూర్ఖపు మాటలు మాట్లాడొద్దని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img