తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆయనెవరో.. ఆయన స్థాయి ఏందో.. బతుకు ఏందో అందరికీ తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన ఏవరి మనిషో కూడా తెలుసు. ఆయనను మాట్లాడిరచేది ఎవరో తెలుసని అన్నారు. ఆయనేదో భారతదేశానికి ప్రధాని అయినట్టు ఫీలవుతున్నాడని అన్నారు. ఆ చిలుక మనదే.. కానీ పలుకు పరాయిది అని ఇది నాకే కాదు అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని ఫ్రాంచైజ్లాగా తీసుకున్నాడు. చంద్రబాబు ఆడిరచే తొలుబొమ్మలాటలో ఆయన ఓ తొలు బొమ్మ. మల్లారెడ్డి అడిగినట్టు రాజీనామా చేయమను. ఇదంతా లొల్లి ఎందుని అన్నారు.