Monday, May 6, 2024
Monday, May 6, 2024

నా పాదయాత్రతో టీఆర్‌ఎస్‌కు చెమటలు… : షర్మిల

తన పాదయాత్రతో టీఆర్‌ఎస్‌కు చెమటలు పడుతున్నాయని వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవన్నారు. తన పాదయాత్ర తెలంగాణ మొత్తం ఆరు నెలల పాటు కొనసాగుతుందన్నారు. లోటస్‌పాండ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం లేదన్నారు. ప్రజల నుంచి తమకు బలమైన మద్దతు వస్తోందని చెప్పారు. ప్రజల కోసమే తాను పాదయాత్ర చేస్తున్నానని వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.నడిచింది తానే అయినా.. నడిపించింది మాత్రం ప్రజలే అన్నారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. వైఎస్సార్‌ని ప్రజలు మరిచిపోలేదన్నారు. షర్మిలను ఆదరిస్తున్నారంటే.. అది వైఎస్సారే కారణమన్నారు. పెట్టుబడులు వస్తే నిరుద్యోగ సమస్య ఎందుకు తీరడం లేదన్నారు. డబ్బులు ఉన్న వారికే రాజ్యసభ పదవులు ఇస్తున్నారని షర్మిల పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img