మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం శుభపరిణామమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తన తరఫున, రైతుల తరఫున ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ చట్టాలు రైతుల ఆమోదం పొందలేకపోవడంతో రానున్న పార్లమెంట్ సమావేశాలలో ఈ చట్టాలను ఉపసంహరిస్తామని ప్రకటించడం ఆయనలోని రాజనీతిజ్ఞతను తెలుపుతోందని పవన్ అన్నారు.