కరీంనగర్ లో శనివారం మహిళల కోసం మెగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డివిజన్ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావు పాల్గొన్నారు. స్థానిక వావిలాలపల్లిలో నిర్వహించిన శిబిరానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.