ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లు ఇద్దరు ఓకే తాను ముక్కలని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. మోదీ రాష్ట్రానికి ఇచ్చింది ఏమిలేదని… కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నది లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ గారు ఉద్యోగాలు ఇచ్చింది లేదు.. కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండు. ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ గారు.. ఉన్న ఉద్యోగులను పీకేస్తూ, నిరుద్యోగులు చచ్చేలా చేస్తున్నారు. మోదీ తెలంగాణకు అన్యాయం చేసి మహారాష్ట్రపై ప్రేమ కురిపించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే రాష్ట్రానికి రైల్వే ఫ్యాక్టరీ సాధించడంలో కేసీఆర్ కొట్లాడిరది లేదు. మోదీ కేంద్ర విద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసింది లేదు’’ అని షర్మిల మండిపడ్డారు.