Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

వేపాడ చిరంజీవిని గెలిపించండి

విశాలాంధ్ర-పార్వతీపురం: ఉత్తరాంధ్ర పట్టభద్రులఅభ్యర్థిగా తెలుగుదేశంపార్టీ తరుపున పోటీచేస్తున్న డాక్టరు వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ద్వారపూరెడ్డి శ్రీదేవి, పార్వతీపురం నియోజకవర్గం పరిశీలకులు గోవిందరాజులు కోరారు.మంగళవారం వారంతా పట్టణంలోని భాస్కర,సాయిరాం విద్యాసంస్థలలోని, సంవంస్థలు మరియు సాయిరాం డిగ్రీ కాలేజీ, ఎస్ఈబి, గ్రామీణ బ్యాంకు, జెకెయస్ తదితరసంస్థలలో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. దీంతోపాటు13,14వార్డుసచివాలవాలయాలసిబ్బందిని కలిసి విద్యావంతుడు చిరంజీవికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు.ఈకార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్, ప్రధాన కార్యదర్శి సిరిపురపు భాష్కరరావు, కోలా మధుసూదనరావు సీనియర్ తెలుగుదేశం నాయకులు గర్భాపు ఉదయభాను,బంకపల్లి రవికుమార్, సంబంగి తిరపతిరావు, కెంగువ ప్రదీపకుమార్ శివ, పోలా సత్యనారాయణ, చింతాడ వైకుంఠ రావు,చంద్రపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img