సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
మాదకద్రవ్యాల రాకెట్ మూఠాను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 50గ్రాముల ఎండీఎమ్ఏ, 45 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని,. మరో కేసులో ఐదు గ్రాముల ఎండీఎమ్ఏ సీజ్ చేశామని చెప్పారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఏడాది డ్రగ్స్ కేసుల్లో 132 కేసుల్లో 257 మందిని అరెస్ట్ చేశామన్నారు. 8మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు.