అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం
నాలా విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్.ఎన్.డీ.పీ.) పై బీఆర్కేఆర్ భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, నాలాల పూడిక వల్ల వర్షాలుపడితే నగరంలో రోడ్లపైకి నీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతి సారీ నగరంలో భారీ వర్షాలు పడితే నాలాలు పొంగడం వల్ల అనేక ప్రాంతాలు నీట మునుగుతున్నాయని, మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడిరచారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ఈ.ఎన్.సి జియాఉద్దీన్, జోనల్ కమీషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.