Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

బలపడుతున్న నైరుతి రుతుపవనాలు

ఏపీలో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు – హీటెక్కుతోన్న తెలంగాణ
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇదివరకే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు వేగంగా ఏపీ, తెలంగాణ వైపు ప్రయాణిస్తున్నాయి. ఇండోనేషియా భూకంపం వల్ల సునామీ ఏర్పడినా మన దేశాన్ని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తాకే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయనివాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో చల్లచల్లగా..
దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతం ప్రభావంతో మేఘాలు ఏర్పడి ఏపీ మేఘావృతమై ఉంటుంది. విశాఖ, అనకాపల్లి, గోదావరి జిల్లాలు మేఘావృతమై ఉండగా.. సాయంకాలానికి బాగా ఉక్కపోతను మారే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, పాడేరు జిల్లాల్లో మాత్రం ఒకట్రెండు చోట్ల వర్షాలు పడతాయి. ఉష్ణోగ్రత సైతం భారీగా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img