హైదరాబాద్ నగర శివార్లలోని రాంజేంద్రనగర్లో పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడిరది.రాజేంద్రనగర్ పరిధిలోని చింతల్మెట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారులో తరలిస్తున్న 43 కిలోల గంజాయిని పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.